Sunday, March 25, 2012

ఫ్రెంచిపాలనలో యానాం - పుస్తకావిష్కరణ

యానాం ఉగాది ఉత్సవాలలో నా మూడవపుస్తకం "ఫ్రెంచిపాలనలో యానాం"  పుస్తకావిష్కరణ, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చే జరిగింది. నా పుస్తకంపై ప్రముఖ కవి, రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ప్రసంగించారు. ఒక పెద్ద సభలో నాకొరకు పావుగంట సమయం కేటాయించిన యానాం ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.

యండమూరి గారి గురించి ఇది వరలో నేచేసిన ఒక కామెంటు ఇక్కడ....

http://raji-fukuoka.blogspot.in/2011/11/blog-post_21.html

మరి అలాంటి పెద్దమనిషి నా పుస్తకాన్ని ఆవిష్కరించటం అంటే ..... what else I need అనిపించే విషయం కాక మరేమిటి?

(ఫొటోలో మధ్యలో తెల్ల డ్రెస్ లో ఉన్నది శ్రీ కృష్ణారావు, శ్రీ గిరిబాబు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ యండమూరి, శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి )
భవదీయుడు
 బొల్లోజు బాబా
 
 

3 comments: